99 మంది బహ్రెయినీ ఉద్యోగుల్ని తొలగించిన కన్స్ట్రక్షన్ కంపెనీ
- July 22, 2017
జిపి జచారియాడెస్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టర్స్ (జిపిజెడ్) సంస్థ 99 మంది బహ్రెయినీ ఉద్యోగుల్ని తొలగించింది. పెండింగ్ జీతాల కోసం ఉద్యోగులు గత నెలలో సనాద్లో ఆందోళన చేయడంతో ఈ సంస్థ వార్తల్లోకెక్కింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సంస్థ సతమతవుతోందని, కాంట్రాక్టర్లకు 30 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఈ సంస్థ చెల్లించాల్సి ఉందని లేబర్ ఎఫైర్స్ - లేబర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారి ఈ సంఘటనపై స్పందిస్తూ వెల్లడించారు. మినిస్ట్రీస్ 2 మిలియన్ బహ్రెయినీ దినార్స్ గనుక వివిధ ప్రాజెక్టుల కోసం విడుదల చేస్తే, సంస్థ, తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతుందని ఆయన చెప్పారు. సంస్థలో సుమారుగా 1000 మంది వలసదారులైన కార్మికులు, 190 మంది బహ్రెయినీ కార్మికులు ఉన్నారు. సంస్థకు చెందిన ఉద్యోగుల్ని ఇతర సంస్థలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







