99 మంది బహ్రెయినీ ఉద్యోగుల్ని తొలగించిన కన్స్ట్రక్షన్ కంపెనీ
- July 22, 2017
జిపి జచారియాడెస్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టర్స్ (జిపిజెడ్) సంస్థ 99 మంది బహ్రెయినీ ఉద్యోగుల్ని తొలగించింది. పెండింగ్ జీతాల కోసం ఉద్యోగులు గత నెలలో సనాద్లో ఆందోళన చేయడంతో ఈ సంస్థ వార్తల్లోకెక్కింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సంస్థ సతమతవుతోందని, కాంట్రాక్టర్లకు 30 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఈ సంస్థ చెల్లించాల్సి ఉందని లేబర్ ఎఫైర్స్ - లేబర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారి ఈ సంఘటనపై స్పందిస్తూ వెల్లడించారు. మినిస్ట్రీస్ 2 మిలియన్ బహ్రెయినీ దినార్స్ గనుక వివిధ ప్రాజెక్టుల కోసం విడుదల చేస్తే, సంస్థ, తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతుందని ఆయన చెప్పారు. సంస్థలో సుమారుగా 1000 మంది వలసదారులైన కార్మికులు, 190 మంది బహ్రెయినీ కార్మికులు ఉన్నారు. సంస్థకు చెందిన ఉద్యోగుల్ని ఇతర సంస్థలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









