కాతిఫ్ షూటౌట్లో ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత
- July 22, 2017
జెడ్డా: కాతిఫ్ గవర్నరేట్ పరిధిలోని సైహాత్ డిస్ట్రిక్ట్లో సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. ఇంటీరియర్ మినిస్ట్రీ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, జులై 156న సెక్యూరిటీ సిబ్బంది అల్ జూర్ సమీపంలో తీవ్రవాదులు గుర్తించారనీ, తీవ్రవాదులు టయోటా కరోలా వాహనాన్ని దొంగిలించారనీ, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, తీవ్రవాదుల్ని చుట్టుముట్టగా, తీవ్రవాదులు కాల్పులకు దిగారనీ, ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారని తెలిపారు. చనిపోయిన ముగ్గురూ పలు కేసుల్లో దోషులని అల్ టుర్కి చెప్పారు. తీవ్రవాదుల నుంచి 10 కిలోగ్రాముల పేలుడు పదార్థాల్ని కనుగొన్నారు. మెషీన్గన్లు, పిస్టోల్ సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు సౌదీ అరేబియా చేపడ్తున్న కార్యక్రమాలకు యూఏఈ మద్దతు పలికింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







