కాతిఫ్ షూటౌట్లో ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత
- July 22, 2017
జెడ్డా: కాతిఫ్ గవర్నరేట్ పరిధిలోని సైహాత్ డిస్ట్రిక్ట్లో సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు వాంటెడ్ టెర్రరిస్టులు హతమయ్యారు. ఇంటీరియర్ మినిస్ట్రీ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, జులై 156న సెక్యూరిటీ సిబ్బంది అల్ జూర్ సమీపంలో తీవ్రవాదులు గుర్తించారనీ, తీవ్రవాదులు టయోటా కరోలా వాహనాన్ని దొంగిలించారనీ, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, తీవ్రవాదుల్ని చుట్టుముట్టగా, తీవ్రవాదులు కాల్పులకు దిగారనీ, ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారని తెలిపారు. చనిపోయిన ముగ్గురూ పలు కేసుల్లో దోషులని అల్ టుర్కి చెప్పారు. తీవ్రవాదుల నుంచి 10 కిలోగ్రాముల పేలుడు పదార్థాల్ని కనుగొన్నారు. మెషీన్గన్లు, పిస్టోల్ సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు సౌదీ అరేబియా చేపడ్తున్న కార్యక్రమాలకు యూఏఈ మద్దతు పలికింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









