భారత్ మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
- July 22, 2017
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నగదు నజరానా ప్రకటించింది. అసాధారణ పోరాటంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు సభ్యులకు తలో రూ.50 లక్షలు నగదు నజరానా ప్రకటించింది. సహాయ సిబ్బందికి తలో రూ.25 లక్షలు ప్రకటించింది. 'క్రికెట్ మక్కా' లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్లో మిథాలీసేన ఇంగ్లాండ్తో తలపడనుంది.
కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ కౌర్, వేద కృష్ణమూర్తి దాదాపు అన్ని మాచ్ లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టును ఫైనల్ చేర్చారు. అలాగే రాజేశ్వరీ గైక్వాడ్, జులన్ గోస్వామి, శిఖ పాండే, ఏక్తా బిష్ఠ్ అద్భుత బౌలింగ్తో జట్టుకు విజయాలు అందించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







