ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్
- July 22, 2017
ఇందు గలదు.. అందు లేదు అన్న సందేహం వద్దు అన్నట్లు తయారైంది డ్రగ్స్ పరిస్థితి. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో... సరఫరా కూడా అదే స్థాయిలో ఊపందుకుంటోంది. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్టులోని ఓ విమానంలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. చెన్నై నుంచి వచ్చిన విమానంలోని ఫుడ్ ట్రాలీలో ఓ సీల్డ్ ప్యాకెట్ను సిబ్బంది గమనించారు. దాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ సిబ్బంది.. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఎయిర్పోర్ట్లో ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కస్టమ్స్ కళ్లను దాటుకుని బయట నుంచి డ్రగ్స్ రావడం దాదాపు అసాధ్యం. అలాంటిది విమానంలోకి మత్తు పదార్థాలు వచ్చాయంటే.. అందులో కచ్చితంగా సిబ్బంది హస్తం ఉంటుంది. ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు విమానం సిబ్బంది వివరాలపై ఆరా తీస్తున్నారు. దాదాపు 2 కిలోల బరువున్న ప్యాకెట్లో ఉన్నది మార్ఫిన్గా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









