24న ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

- July 22, 2017 , by Maagulf
24న ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, విభజన చట్టంలో పెండింగ్ సమస్యలే ఎజెండాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూరేశారు. ఈ నెల 24న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ మూడు రోజుల పాటు అక్కడే మకాం పెట్టనున్నారు. 25వతేదీన కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీతోపాటు కొంతమంది కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పెండింగ్ అంశాలపై సీరియస్ గా చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపును మోదీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com