టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

- July 23, 2017 , by Maagulf
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌ తుది సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ సారథి హైదర్‌ నైట్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇక ఇప్పటి వరకూ ఇంగ్లాండ్‌ మూడుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది. రెండోసారి ఫైనల్‌కి చేరిన భారత్‌ ఈ సారి ఎలాగైనా కప్‌ గెలవాలని కృతనిశ్చయంతో ఉంది.

భారత్‌: పూనమ్‌ రౌత్‌, స్మృతి మంధానా, మిథాలీరాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ ప్రీత్‌, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, సుష్మా వర్మ(వికెట్‌ కీపర్‌), జులన్‌ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌.

ఇంగ్లాండ్‌: లారెన్‌ విన్‌ ఫీల్డ్‌, టామీ బ్యూమాంట్‌, హైదర్‌ నైట్‌(కెప్టెన్‌), సారా టేలర్‌, నటాలీ షీవర్‌, ఫ్రాన్‌ విల్సన్‌, కేథరిన్‌ బ్రంట్‌, జెన్నీ గున్‌, లారా మార్ష్‌, అన్య ష్రబ్‌సోల్‌, అలెక్స్‌ హార్డ్‌లీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com