ఏపీ లో డ్రగ్స్ పై కొరడా

- July 23, 2017 , by Maagulf
ఏపీ లో డ్రగ్స్ పై కొరడా

పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్‌ శాఖకు చెందిన అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొని డ్రగ్స్‌ నిర్మాలనపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్రగ్స్‌ దుష్ఫలితాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్‌ నియంత్రణపై టోల్‌ ఫ్రీ నెంబర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, డ్రగ్స్‌ నియంత్రణపై ఈ నెల 25న కళాశాలల యాజమాన్యాలతో సమావేశమవనున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశాఖలో భారీ ర్యాలీ చేపడతానని, గంజాయి రవాణా నియంత్రణపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com