నాజీల నౌకలో టన్నుల కొద్దీ బంగారం బయటకి తీసే ప్రయత్నం
- July 24, 2017
ఏళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయిన నాజీల ఓడను వెలికితీసేందుకు ట్రెజర్ హంటర్లు భావిస్తున్నారు. ఈమేరకు ఐలాండ్ ప్రభుత్వానికి ధరఖాస్తు కూడ చేసుకొన్నారు.
రెండో ప్రపంచ యుద్దసమయంలో దక్షిణ అమెరికా నుండి జర్మనీకి తరలిస్తున్న టన్నులకొద్దీ బంగారం ముగిగిపోయిన ఓడలో ఉందని ట్రెజర్ హంటర్లు నమ్ముతున్నారు.
1939 రెండో ప్రపంచయుద్దం జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ అమెరికా నుండి జర్మనీకి బయలుదేరిన ఈ ఓడను ఇంగ్లాడ్ తన సముద్రజలాల్లో అడ్డుకొని దాడి చేసింది. దాంతో ఓడతో పాటు దక్షిణ అమెరికా నుండి వస్తున్న విలువైన వస్తువులు సముద్ర అంతర్భాగంలో కలిసిపోయాయి.
దాదాపు నాలుగు టన్నుల బంగారం మునిగిపోయిన ఓడలో దాగి ఉందనే పలువురు అభిప్రాయంతో ఉన్నారు. బంగారం విలువ దాదాపు వంద మిలియన్ పౌండ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓడలో ఉన్న బాక్సును వెలికితీసేందుకు బ్రిటన్కు చెందిన ఓ కంపెనీల ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో ఐలాండ్ సముద్రజలాల్లోకి ప్రవేశించి పరిశోధనలు చేయాలని భావించినా ఆ దేశ ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో నేవీ ఒప్పుకోలేదు. దీంతో ఐలాండ్ ప్రభుత్వం నుండి గ్రీన్సిగ్నల్ కోసం బ్రిటన్ కంపెనీ ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







