200 టన్నుల కన్స్ట్రక్షన్ వ్యర్ధాల తొలగింపు
- July 24, 2017
క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోంచి 200 టన్నుల కన్స్ట్రక్షన్ వ్యర్ధాల్ని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా కన్స్ట్రక్షన్ వ్యర్థాల్ని కొందరు డంప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జుఫైర్లోని 35 కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులకు సంబంధించిన సంస్థలకు హెచ్చరికల్ని కూడా అధికారులు జారీ చేశారు. ఉల్లంఘనులు సొంత ఖర్చులతో సమస్యను పరిష్కరించుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్లు జనరల్ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. డెవలపర్స్ అలాగే ఇంజనీరింగ్ సంస్థలు తమ సైట్స్ చుట్టూ ఫెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆ ఫెన్స్లోనే తమ భవనాలకు సంబంధించిన మెటీరియల్ని ఉంచుకోవాలని స్పష్టం చేశారాయన. ఇకపై తనిఖీలు రెగ్యులర్గా ఉంటాయనీ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసకుంటామని షేక్ మొహమ్మద్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







