ఎండవేడిమితో దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్ ఇబ్బందులు
- July 24, 2017
ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్, ఎండ వేడిమికి తాళలేకపోతున్నామంటున్నారు. తమ ప్రాంతంలో బస్ షెల్టర్స్ ఉన్నా, అవి ఎండ వేడిమి నుంచి రక్షణ ఇవ్వలేకపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సిటీలో 60,000 మంది వరకూ నివసిస్తున్నారు. వీరికి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) బస్సులే ముఖ్యమైన రవాణా సాధనాలు. ఎండ వేడిమి 40 డిగ్రీలు దాటితే తమ ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోందని ప్రయాణీకులు వాపోయారు. కవర్ చేసి ఉన్న ఏసీ బస్ స్టాప్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్ అభ్యర్థిస్తున్నారు. అయితే సమస్యను గుర్తించామనీ, నఖీల్తో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టిఎ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







