గుజరాత్ రాష్ట్రం లో భారీ వరదలు
- July 25, 2017
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బనస్కంతా, పతన్ జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లు నీటమునిగాయి. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. రంగంలోకి దిగిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బనస్కంతా జిల్లా నుంచి 10వేల మందిని, పతన్ నుంచి 9,790. అహ్మద్బాద్లో 2,800మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 'ముంపు బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 12 బృందాలు, ఆర్మీ బలగాలను బనస్కంతాకు పంపించాం' అని రూపాని అన్నారు. వరద బాధితులను కాపాడేందుకు వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లను ఏర్పాటుచేశారు. వరదల కారణంగా దిల్లీ-అహ్మదాబాద్ రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.
కాగా.. రాజస్థాన్, పశ్చిమ్బంగాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. రాజస్థాన్లో వరదల కారణంగా ఇద్దరు మృతిచెందారు. బంగాల్లో బీర్భమ్, పురులియా, పశ్చిమ మెడ్నిపోర్, హూగ్లీ జిల్లాలు నీటమునిగాయి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







