గుజరాత్ రాష్ట్రం లో భారీ వరదలు
- July 25, 2017
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బనస్కంతా, పతన్ జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లు నీటమునిగాయి. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. రంగంలోకి దిగిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బనస్కంతా జిల్లా నుంచి 10వేల మందిని, పతన్ నుంచి 9,790. అహ్మద్బాద్లో 2,800మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 'ముంపు బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 12 బృందాలు, ఆర్మీ బలగాలను బనస్కంతాకు పంపించాం' అని రూపాని అన్నారు. వరద బాధితులను కాపాడేందుకు వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లను ఏర్పాటుచేశారు. వరదల కారణంగా దిల్లీ-అహ్మదాబాద్ రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.
కాగా.. రాజస్థాన్, పశ్చిమ్బంగాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. రాజస్థాన్లో వరదల కారణంగా ఇద్దరు మృతిచెందారు. బంగాల్లో బీర్భమ్, పురులియా, పశ్చిమ మెడ్నిపోర్, హూగ్లీ జిల్లాలు నీటమునిగాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









