ఇండోనేషియాలోని పడవ మునిగి..10మంది మృతి
- July 25, 2017
ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు జర్మన్ జాతీయులతో సహా మొత్తం పది మంది చనిపోయారు. ఉత్తర బోర్నియో ద్వీపంలోని తారకన్ నుంచి 51 మందితో ఓపడవ తాన్జుంగ్సెలార్ వైపు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభించిన పది నిమిషాల్లోనే పడవను బలమైన అల తాకటంతో బోల్తా పడింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి 23మందిని రక్షించగలిగారు.
అలాగే, రెండేళ్ల చిన్నారి సహా ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఇద్దరు జర్మన్లు. మిగతా వారి జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇండోనేషియాలో మొత్తం 17వేల వరకు దీవులున్నాయి. అక్కడి ప్రజల రవాణాకు పడవలపైనే ఆధారపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తరచూ పడవ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఆరంభంలో తిడుంగ్ దీవిలో జరిగిన పడవ ప్రమాదంలో 23 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









