టెంపరరీ పెయింట్‌ని తొలగించాలి: ఆర్‌ఓపి

- July 26, 2017 , by Maagulf
టెంపరరీ పెయింట్‌ని తొలగించాలి: ఆర్‌ఓపి

కొందరు కార్ల యజమానులు దోహార్‌కి వెళ్ళి వచ్చే క్రమంలో ఇసుక నుంచి తమ వాహనాలకు రక్షణ కల్పించే క్రమంలో, ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్‌ వేయిస్తున్నారు. అయితే, తిరిగి వచ్చాక కూడా వాటిని తొలగించకపోవడం పట్ల రాయల్‌ ఒమన్‌ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువమంది విజిటర్స్‌ మస్కట్‌ నుంచి సలాలాకి వెళుతున్నారనీ, సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుందనీ, ఈ నేపథ్యంలో వాహనాలకు ఇసుక నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన తాత్కాలిక పెయింట్స్‌ వేయిస్తున్నారని పోలీసులు చెప్పారు. తేలిగ్గా ఈ పెయింట్‌ని తొలగించడానికి వీలుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com