భారత్ లో మహిళా ప్రయాణికులకు విస్తారా ఆఫర్
- July 27, 2017
దిల్లీకి చెందిన విస్తారా ఎయిర్లైన్స్ మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. విమానంలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మధ్య సీట్లు కాకుండా విండో సీట్లు లేదా వరుసలో మొదటి సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. అంతేకాకుండా విమానం ఎక్కేముందు, దిగాక కూడా వారి అవసరాలను చూసుకోవాలని నిర్ణయించింది.
రోజులో 75 నుంచి 100 మంది మహిళా ప్రయాణికులు ఈ సేవలు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. మహిళా ప్రయాణికులకు ఇలాంటి ఆఫర్ ప్రకటించిన తొలి ఎయిర్లైన్ సంస్థ విస్తారానే కావడం విశేషం. విమానం ల్యాండ్ అయ్యాక దిగేటప్పుడు మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని విస్తారా చీఫ్ సంజీవ్ కపూర్ వెల్లడించారు.
‘విస్తారాలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఎయిర్పోర్ట్ ఆధారిత ట్యాక్సీలను బుక్ చేయించడంతో పాటు విమానం దిగాక వారి అనుమతి మేరకు దగ్గరుండి ట్యాక్సీ ఎక్కించే ఏర్పాట్లు మా సిబ్బందే దగ్గరుండి చూసుకుంటారు. ఇలాంటి చర్యలతో మహిళలు విస్తారా విమానాల్లో నిశ్చింతగా ప్రయాణించే వీలుంటుంది’ అని వెల్లడించారు సంజీవ్.
ఈ కొత్త సర్వీసులను అంతర్జాతీయంగానూ విస్తరింపజేసి విదేశీ మహిళలకు కూడా ఈ సదుపాయాలను కల్పించనుంది విస్తారా. అంతేకాకుండా విస్తారా విమానాల్లో బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లో శిక్షణ తీసుకున్న పైలట్లనే ఎంపిక చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









