భారత్ లో మహిళా ప్రయాణికులకు విస్తారా ఆఫర్
- July 27, 2017
దిల్లీకి చెందిన విస్తారా ఎయిర్లైన్స్ మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. విమానంలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మధ్య సీట్లు కాకుండా విండో సీట్లు లేదా వరుసలో మొదటి సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. అంతేకాకుండా విమానం ఎక్కేముందు, దిగాక కూడా వారి అవసరాలను చూసుకోవాలని నిర్ణయించింది.
రోజులో 75 నుంచి 100 మంది మహిళా ప్రయాణికులు ఈ సేవలు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. మహిళా ప్రయాణికులకు ఇలాంటి ఆఫర్ ప్రకటించిన తొలి ఎయిర్లైన్ సంస్థ విస్తారానే కావడం విశేషం. విమానం ల్యాండ్ అయ్యాక దిగేటప్పుడు మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని విస్తారా చీఫ్ సంజీవ్ కపూర్ వెల్లడించారు.
‘విస్తారాలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఎయిర్పోర్ట్ ఆధారిత ట్యాక్సీలను బుక్ చేయించడంతో పాటు విమానం దిగాక వారి అనుమతి మేరకు దగ్గరుండి ట్యాక్సీ ఎక్కించే ఏర్పాట్లు మా సిబ్బందే దగ్గరుండి చూసుకుంటారు. ఇలాంటి చర్యలతో మహిళలు విస్తారా విమానాల్లో నిశ్చింతగా ప్రయాణించే వీలుంటుంది’ అని వెల్లడించారు సంజీవ్.
ఈ కొత్త సర్వీసులను అంతర్జాతీయంగానూ విస్తరింపజేసి విదేశీ మహిళలకు కూడా ఈ సదుపాయాలను కల్పించనుంది విస్తారా. అంతేకాకుండా విస్తారా విమానాల్లో బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లో శిక్షణ తీసుకున్న పైలట్లనే ఎంపిక చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







