పట్టాలెక్కనున్నహీరో కమల్హాసన్ మరో చిత్రం
- July 27, 2017
అగ్ర కథానాయకుడు కమల్హాసన్ తన కొత్త చిత్రం గురించి ప్రకటించారు. ‘తలైవన్ ఇరుక్కిరాన్’ అనే చిత్రంలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్ ప్రధాన పాత్రలో ‘శభాష్ నాయుడు’, ‘విశ్వరూపం 2’ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తర్వాత ఆయన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నిజానికి కొన్ని ఏళ్ల ముందే కమల్ ఈ నూతన ప్రాజెక్టు గురించి ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. మల్లీస్టారర్గా దీన్ని రూపొందించనున్నారట. ఆర్థిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని 2015లో కమల్ చెప్పారు. సినిమా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చిత్ర బృందం ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









