పట్టాలెక్కనున్నహీరో కమల్హాసన్ మరో చిత్రం
- July 27, 2017
అగ్ర కథానాయకుడు కమల్హాసన్ తన కొత్త చిత్రం గురించి ప్రకటించారు. ‘తలైవన్ ఇరుక్కిరాన్’ అనే చిత్రంలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్ ప్రధాన పాత్రలో ‘శభాష్ నాయుడు’, ‘విశ్వరూపం 2’ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తర్వాత ఆయన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నిజానికి కొన్ని ఏళ్ల ముందే కమల్ ఈ నూతన ప్రాజెక్టు గురించి ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. మల్లీస్టారర్గా దీన్ని రూపొందించనున్నారట. ఆర్థిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని 2015లో కమల్ చెప్పారు. సినిమా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చిత్ర బృందం ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









