పట్టాలెక్కనున్నహీరో కమల్హాసన్ మరో చిత్రం
- July 27, 2017
అగ్ర కథానాయకుడు కమల్హాసన్ తన కొత్త చిత్రం గురించి ప్రకటించారు. ‘తలైవన్ ఇరుక్కిరాన్’ అనే చిత్రంలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్ ప్రధాన పాత్రలో ‘శభాష్ నాయుడు’, ‘విశ్వరూపం 2’ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తర్వాత ఆయన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నిజానికి కొన్ని ఏళ్ల ముందే కమల్ ఈ నూతన ప్రాజెక్టు గురించి ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. మల్లీస్టారర్గా దీన్ని రూపొందించనున్నారట. ఆర్థిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని 2015లో కమల్ చెప్పారు. సినిమా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చిత్ర బృందం ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







