కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎన్. ధరంసింగ్ కన్నుమూత
- July 27, 2017
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎన్. ధరంసింగ్ (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధరంసింగ్ బెంగళూరు నగరంలోని ఎంఎస్. రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గురువారం మద్యాహ్నం చికిత్స విఫలమై ధరంసింగ్ మరణించారు. 1936 డిసెంబర్ 25వ తేదిన కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా జీవర్గీలో ధరంసింగ్ జన్మించారు. గుల్బర్గ మునిసిపాలిటి కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2004 మే 28 నుంచి 2006 ఫిబ్రవరి 3వ తేదీ వరకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో ధరంసింగ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు (కాంగ్రెస్) మల్లికార్జున ఖార్గేకి ధరంసింగ్ అత్యంత సన్నిహితుడు. దేవరాజ్ అరసు, గుండురావు, బంగారప్ప, వీరప్పమొయిలీ, ఎస్ఎం. క్రిష్ణ కర్ణాటక ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో ధరంసింగ్ మంత్రిగా పని చేశారు. పార్టీలకు అతీతంగా అందరితో స్నేహంగా ఉంటున్న ధరంసింగ్ ఆజాతశత్రువు అని పేరు తెచ్చుకున్నారు. ధరంసింగ్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా అనేక మంది ప్రముఖ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







