గోల్డ్, జ్యుయెలరీ షాప్లలో ఉల్లంఘనలు: పలువురికి జరీమానా, జైలు
- July 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ఎంసిఐ), ఇటీవలి కాలంలో గోల్డ్ మియు జ్యుయెలరీ దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల సందర్భంగా 128 ఉల్లంఘనల్ని గుర్తించినట్లు పేర్కొంది. ఉల్లంఘనులకు 2 ఏళ్ళ జైలు శిక్ష, అలాగే 400,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించినట్లు పేర్కొంది. గత వారం మినిస్ట్రీ 2,67 తనిఖీల్ని గోల్డ్ మరియు జ్యుయెలరీ దుకాణాల్లో నిర్వహించింది. ఈ సందర్భంగా 128 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఇన్వాయిస్ మరియు ప్రైస్ ట్యాగ్స్కి సంబంధించి 63 ఉల్లంఘనలు వీటిల్లో ఉన్నాయి. అమ్మకాల సందర్భంగా స్కేల్స్ని వినియోగించకపోవడం అనే ఉల్లంగనలు 17 నమోదయ్యాయి. లైసెన్స్ లేని ఉల్లంఘనలు 11 గుర్తించారు. అమ్మకానికి ఉంచిన గోల్డ్కి స్టాంపింగ్ లేని కారణంగా 2 ఉల్లంఘనలు గుర్తించారు. ఎలాంటి ఉల్లంఘనలపై అనుమానం కలిగినా వినియోగదారులు మినిస్ట్రీ కాల్ సెంటర్ 1900 ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







