గోల్డ్, జ్యుయెలరీ షాప్లలో ఉల్లంఘనలు: పలువురికి జరీమానా, జైలు
- July 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ఎంసిఐ), ఇటీవలి కాలంలో గోల్డ్ మియు జ్యుయెలరీ దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల సందర్భంగా 128 ఉల్లంఘనల్ని గుర్తించినట్లు పేర్కొంది. ఉల్లంఘనులకు 2 ఏళ్ళ జైలు శిక్ష, అలాగే 400,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించినట్లు పేర్కొంది. గత వారం మినిస్ట్రీ 2,67 తనిఖీల్ని గోల్డ్ మరియు జ్యుయెలరీ దుకాణాల్లో నిర్వహించింది. ఈ సందర్భంగా 128 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఇన్వాయిస్ మరియు ప్రైస్ ట్యాగ్స్కి సంబంధించి 63 ఉల్లంఘనలు వీటిల్లో ఉన్నాయి. అమ్మకాల సందర్భంగా స్కేల్స్ని వినియోగించకపోవడం అనే ఉల్లంగనలు 17 నమోదయ్యాయి. లైసెన్స్ లేని ఉల్లంఘనలు 11 గుర్తించారు. అమ్మకానికి ఉంచిన గోల్డ్కి స్టాంపింగ్ లేని కారణంగా 2 ఉల్లంఘనలు గుర్తించారు. ఎలాంటి ఉల్లంఘనలపై అనుమానం కలిగినా వినియోగదారులు మినిస్ట్రీ కాల్ సెంటర్ 1900 ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









