శుక్ర, శనివారాల్లో దుబాయ్ మెట్రో పాక్షికంగా మూసివేత
- July 27, 2017
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్లైన్కి సంబంధించి ఓ సెగ్మెంట్ తాత్కాలికంగా ప్రతి శుక్రవారం మరియు శనివారం మూసివేయబడుతుంది. జులై 28 నుంచి 10 వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూట్ 2020తో రెడ్లైన్ లింక్ కోసం ఈ తాత్కాలిక మూసివేత చేపడుతున్నారు. గత ఏడాది 15 కిలోమీటర్ల పొడవైన 2020 రూట్ పనులు చేపట్టబడ్డాయి. నకీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ని ఎక్స్పో 2020 సైట్తో ఈ మార్గం కనెక్ట్ చేస్తుంది. జుమైరా లేక్ టవర్స్ మరియు ఐబిఎన్ బట్టుట మెట్రో స్టేషన్ల మధ్య ఉచిత సర్క్యులర్ బస్, ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. మూసివేత అమల్లో ఉన్నన్ని రోజులూ ఈ బస్ సేవలు అందిస్తుంది. 2020 రూట్ 10.6 బిలియన్ దిర్హామ్లతో చేపడుతున్నారు. 2019 చివరి నాటికి ఇది పూర్తవుతుంది. 2020 మే 20 నుంచి ఈ రూట్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









