శుక్ర, శనివారాల్లో దుబాయ్ మెట్రో పాక్షికంగా మూసివేత
- July 27, 2017
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్లైన్కి సంబంధించి ఓ సెగ్మెంట్ తాత్కాలికంగా ప్రతి శుక్రవారం మరియు శనివారం మూసివేయబడుతుంది. జులై 28 నుంచి 10 వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూట్ 2020తో రెడ్లైన్ లింక్ కోసం ఈ తాత్కాలిక మూసివేత చేపడుతున్నారు. గత ఏడాది 15 కిలోమీటర్ల పొడవైన 2020 రూట్ పనులు చేపట్టబడ్డాయి. నకీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ని ఎక్స్పో 2020 సైట్తో ఈ మార్గం కనెక్ట్ చేస్తుంది. జుమైరా లేక్ టవర్స్ మరియు ఐబిఎన్ బట్టుట మెట్రో స్టేషన్ల మధ్య ఉచిత సర్క్యులర్ బస్, ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. మూసివేత అమల్లో ఉన్నన్ని రోజులూ ఈ బస్ సేవలు అందిస్తుంది. 2020 రూట్ 10.6 బిలియన్ దిర్హామ్లతో చేపడుతున్నారు. 2019 చివరి నాటికి ఇది పూర్తవుతుంది. 2020 మే 20 నుంచి ఈ రూట్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







