శుక్ర, శనివారాల్లో దుబాయ్ మెట్రో పాక్షికంగా మూసివేత
- July 27, 2017దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్లైన్కి సంబంధించి ఓ సెగ్మెంట్ తాత్కాలికంగా ప్రతి శుక్రవారం మరియు శనివారం మూసివేయబడుతుంది. జులై 28 నుంచి 10 వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూట్ 2020తో రెడ్లైన్ లింక్ కోసం ఈ తాత్కాలిక మూసివేత చేపడుతున్నారు. గత ఏడాది 15 కిలోమీటర్ల పొడవైన 2020 రూట్ పనులు చేపట్టబడ్డాయి. నకీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ని ఎక్స్పో 2020 సైట్తో ఈ మార్గం కనెక్ట్ చేస్తుంది. జుమైరా లేక్ టవర్స్ మరియు ఐబిఎన్ బట్టుట మెట్రో స్టేషన్ల మధ్య ఉచిత సర్క్యులర్ బస్, ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. మూసివేత అమల్లో ఉన్నన్ని రోజులూ ఈ బస్ సేవలు అందిస్తుంది. 2020 రూట్ 10.6 బిలియన్ దిర్హామ్లతో చేపడుతున్నారు. 2019 చివరి నాటికి ఇది పూర్తవుతుంది. 2020 మే 20 నుంచి ఈ రూట్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..