శుక్ర, శనివారాల్లో దుబాయ్ మెట్రో పాక్షికంగా మూసివేత
- July 27, 2017
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్లైన్కి సంబంధించి ఓ సెగ్మెంట్ తాత్కాలికంగా ప్రతి శుక్రవారం మరియు శనివారం మూసివేయబడుతుంది. జులై 28 నుంచి 10 వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూట్ 2020తో రెడ్లైన్ లింక్ కోసం ఈ తాత్కాలిక మూసివేత చేపడుతున్నారు. గత ఏడాది 15 కిలోమీటర్ల పొడవైన 2020 రూట్ పనులు చేపట్టబడ్డాయి. నకీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ని ఎక్స్పో 2020 సైట్తో ఈ మార్గం కనెక్ట్ చేస్తుంది. జుమైరా లేక్ టవర్స్ మరియు ఐబిఎన్ బట్టుట మెట్రో స్టేషన్ల మధ్య ఉచిత సర్క్యులర్ బస్, ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. మూసివేత అమల్లో ఉన్నన్ని రోజులూ ఈ బస్ సేవలు అందిస్తుంది. 2020 రూట్ 10.6 బిలియన్ దిర్హామ్లతో చేపడుతున్నారు. 2019 చివరి నాటికి ఇది పూర్తవుతుంది. 2020 మే 20 నుంచి ఈ రూట్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









