శుక్ర, శనివారాల్లో దుబాయ్‌ మెట్రో పాక్షికంగా మూసివేత

- July 27, 2017 , by Maagulf
శుక్ర, శనివారాల్లో దుబాయ్‌ మెట్రో పాక్షికంగా మూసివేత

దుబాయ్‌: దుబాయ్‌ మెట్రో రెడ్‌లైన్‌కి సంబంధించి ఓ సెగ్మెంట్‌ తాత్కాలికంగా ప్రతి శుక్రవారం మరియు శనివారం మూసివేయబడుతుంది. జులై 28 నుంచి 10 వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూట్‌ 2020తో రెడ్‌లైన్‌ లింక్‌ కోసం ఈ తాత్కాలిక మూసివేత చేపడుతున్నారు. గత ఏడాది 15 కిలోమీటర్ల పొడవైన 2020 రూట్‌ పనులు చేపట్టబడ్డాయి. నకీల్‌ హార్బర్‌ మరియు టవర్‌ స్టేషన్‌ని ఎక్స్‌పో 2020 సైట్‌తో ఈ మార్గం కనెక్ట్‌ చేస్తుంది. జుమైరా లేక్‌ టవర్స్‌ మరియు ఐబిఎన్‌ బట్టుట మెట్రో స్టేషన్ల మధ్య ఉచిత సర్క్యులర్‌ బస్‌, ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. మూసివేత అమల్లో ఉన్నన్ని రోజులూ ఈ బస్‌ సేవలు అందిస్తుంది. 2020 రూట్‌ 10.6 బిలియన్‌ దిర్హామ్‌లతో చేపడుతున్నారు. 2019 చివరి నాటికి ఇది పూర్తవుతుంది. 2020 మే 20 నుంచి ఈ రూట్‌ అందుబాటులోకి వస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com