యాత్రీకుల రాక: ఏర్పాట్లు పూర్తి చేసిన హజ్ మినిస్ట్రీ
- July 27, 2017జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, భూ మార్గం, జల మార్గం, ఆకాశ మార్గాల్లో యాత్రీకులు రావడం మొదలైనట్లు ప్రకటించింది. ఆదివారం కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా 325 మంది యాత్రీకులు చేరుకున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన తొలి హజ్ విమానం ఇది. 651 మందితో కూడిన మూడు విమానాలు మదీనా ఎయిర్పోర్ట్కి పాకిస్తాన్ నుంచి చేరుకున్నాయి. మరికొన్ని అంతర్జాతీయ విమానాలు చేరుకోనున్నాయి. మినిస్టర్ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా మొహమ్మద్ సలిహ్ బెంటిన్ సూచనల మేరకు మినిస్ట్రీ హజ్ యాత్రీకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మినిస్ట్రీ కింద పనిచేసే అన్ని సెక్టార్స్, యాత్రీకులకు తగిన రీతిలో సౌకర్యాలు కల్పించాలనీ, ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మక్కా మరియు మీదానాల్లోని హజ్ సర్వీస్ సెంటర్స్ యాత్రీకులకు తగు సూచనలు చేయాలని, వారికి అవసరమైన సేవలందించాలని కూడా ఆదేశించారు మినిస్టర్. పవిత్ర రమదాన్ మాసంలో ఉమ్రా ప్రార్థనల సందర్భంగా 3 మిలియన్ మంది యాత్రీకులు 30 రోజుల్లో వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..