మిథాలీ రాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్

- July 28, 2017 , by Maagulf
మిథాలీ రాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్

భారత మహిళ క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం తరపున రూ.కోటి నగదు ప్రోత్సహాన్ని, బంజారాహిల్స్‌లో 600 గజాలకు తగ్గకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

కోచ్‌ మూర్తికి రూ.25లక్షల నగదు ప్రకటించారు. సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న మీథాలీ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ప్రపంచ కప్‌ పోటీల్లో అద్భుతంగా ఆడారని, దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో ఫైనల్‌లో ఓడిపోయారని, అయినప్పటీకి మీ జట్టంతా అద్భుతంగా ఆడిందని ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం మిథాలీని, కోచ్‌ ఆర్‌.ఎస్‌.ఆర్‌ మూర్తికి శాలువ కప్పి సన్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com