త్వరలో రానున్న రూ.200 నోటు
- July 28, 2017
రూ.2వేల నోటు రద్దుకు సంబంధించి సమాచారం లేదని, ఆర్బీఐ తీసుకురానున్న రూ.200 నోటు మాత్రం త్వరలో చలామణీలోకి వస్తుందని ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోష్కుమార్ గాంగ్వార్ తెలిపారు. ఓ న్యూస్ ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో గాంగ్వార్ మాట్లాడుతూ రూ.200 నోట్ల ముద్రణ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే కొత్త కరెన్సీని విడుదల చేస్తామని పేర్కొన్నారు. రూ.2వేల నోట్ల రద్దు అంశంపై ఆయన మాట్లాడుతూ దానిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఆ నోటు ముద్రణ నిలిపివేయడం గురించి మాట్లాడుతూ ‘అది వేరే వ్యవహారం. అయినా ఆర్బీఐ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. దానిపై ఆర్బీఐ స్పష్టత ఇస్తుంది’ అని చెప్పారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన రూ.2వేల నోటును రద్దు చేస్తారంటూ వూహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 26న రాజ్యసభలో విపక్షాలు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. దీనిపై సభలోనే ఉన్న జైట్లీ ఎలాంటి సమాధానం చెప్పకపోవడం గమనార్హం. దీంతో రూ.2వేల నోటును భవిష్యత్లో రద్దు చేస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఏర్పడలేదు. మరోవైపు ఇప్పటికే రూ. 2000 నోట్ల ముద్రణ ప్రక్రియను నిలిపివేశారని తెలుస్తోంది. మరోవైపు అధికార వర్గాల సమాచారం మేరకు ఆగస్టులో రూ.200 నోట్లు చలామణీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మైసూరులోకి ముద్రణాలయంలో ఆర్బీఐ అధికారుల పర్యవేక్షణలో కొత్త నోట్లను ముద్రించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







