త్వరలో రానున్న రూ.200 నోటు
- July 28, 2017
రూ.2వేల నోటు రద్దుకు సంబంధించి సమాచారం లేదని, ఆర్బీఐ తీసుకురానున్న రూ.200 నోటు మాత్రం త్వరలో చలామణీలోకి వస్తుందని ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోష్కుమార్ గాంగ్వార్ తెలిపారు. ఓ న్యూస్ ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో గాంగ్వార్ మాట్లాడుతూ రూ.200 నోట్ల ముద్రణ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే కొత్త కరెన్సీని విడుదల చేస్తామని పేర్కొన్నారు. రూ.2వేల నోట్ల రద్దు అంశంపై ఆయన మాట్లాడుతూ దానిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఆ నోటు ముద్రణ నిలిపివేయడం గురించి మాట్లాడుతూ ‘అది వేరే వ్యవహారం. అయినా ఆర్బీఐ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. దానిపై ఆర్బీఐ స్పష్టత ఇస్తుంది’ అని చెప్పారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన రూ.2వేల నోటును రద్దు చేస్తారంటూ వూహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 26న రాజ్యసభలో విపక్షాలు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. దీనిపై సభలోనే ఉన్న జైట్లీ ఎలాంటి సమాధానం చెప్పకపోవడం గమనార్హం. దీంతో రూ.2వేల నోటును భవిష్యత్లో రద్దు చేస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఏర్పడలేదు. మరోవైపు ఇప్పటికే రూ. 2000 నోట్ల ముద్రణ ప్రక్రియను నిలిపివేశారని తెలుస్తోంది. మరోవైపు అధికార వర్గాల సమాచారం మేరకు ఆగస్టులో రూ.200 నోట్లు చలామణీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మైసూరులోకి ముద్రణాలయంలో ఆర్బీఐ అధికారుల పర్యవేక్షణలో కొత్త నోట్లను ముద్రించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









