త్వరలో నూతన టెలికాం విధానం
- July 28, 2017
నూతన టెలికాం విధాన ముసాయిదా ప్రక్రియను ఆ శాఖ చేపట్టింది. ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా ఇది సిద్ధం కానుంది. ‘ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా వృద్ధి చెందుతుండటంతో టెలికాం శాఖ నూతన జాతీయ టెలికాం విధాన ప్రక్రియ ఆరంభించింది. ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా ముసాయిదా సిద్ధమవుతుంది’ అని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభలో తెలిపారు. సాంకేతిక సృజన, భద్రత, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలు ఇందులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత జాతీయ టెలికాం విధానం 2012లో అమల్లోకి వచ్చింది. స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపు, పంచుకోవడం, స్పెక్ట్రమ్ వ్యాపారం, బ్రాండ్బ్యాండ్ వేగం, చోరీ అయిన మొబైళ్లను బ్లాక్ చేయడం వంటివి ఈ విధానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2 ఎంబీపీఎస్ బ్రాండ్బ్యాండ్ వేగాన్ని మాత్రం ఇంకా అందుకోలేదు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









