త్వరలో నూతన టెలికాం విధానం
- July 28, 2017
నూతన టెలికాం విధాన ముసాయిదా ప్రక్రియను ఆ శాఖ చేపట్టింది. ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా ఇది సిద్ధం కానుంది. ‘ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా వృద్ధి చెందుతుండటంతో టెలికాం శాఖ నూతన జాతీయ టెలికాం విధాన ప్రక్రియ ఆరంభించింది. ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా ముసాయిదా సిద్ధమవుతుంది’ అని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభలో తెలిపారు. సాంకేతిక సృజన, భద్రత, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలు ఇందులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత జాతీయ టెలికాం విధానం 2012లో అమల్లోకి వచ్చింది. స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపు, పంచుకోవడం, స్పెక్ట్రమ్ వ్యాపారం, బ్రాండ్బ్యాండ్ వేగం, చోరీ అయిన మొబైళ్లను బ్లాక్ చేయడం వంటివి ఈ విధానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2 ఎంబీపీఎస్ బ్రాండ్బ్యాండ్ వేగాన్ని మాత్రం ఇంకా అందుకోలేదు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







