గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా GFA అవార్డు అందజేసిన బాలీవుడ్ స్టార్ కరిష్మా కపూర్
- July 28, 2017
దక్షిణాదిలో అత్యుత్తమ శిక్షణ సంస్థగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ పురస్కారాన్ని అందుకుంది. ఢిల్లీకి చెందిన యాప్స్ గ్రూప్ రైసింగ్ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 21న గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ దక్షిణాది నుంచి మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ జీఎఫ్ఏకు ఈ పురస్కారాన్ని అందించింది. రైసింగ్ లీడర్ షిప్ అవార్డు అందుకోవడంపై గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ సంస్థ ఛైర్మన్ దీపక్ బల్దేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ...రైసింగ్ లీడర్ షిప్ అవార్డు మాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నాము. మరింత ప్రభావంతంగా పనిచేసేందుకు మాకు ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ రెండేళ్లలో మా సంస్థకు 7 అవార్డులు దక్కాయి. 2016 లో నాలుగు పురస్కారాలు రాగా...ఈ ఏడాది మూడు అవార్డులు అందుకున్నాం. మా సంస్థలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నప్పుడు మాకు ఈ పురస్కారాల దక్కడం కంటే ఎక్కువ ఆనందాన్ని కలుగుతుంది. ప్రతి విద్యార్థి విజయమే మా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ విజయంగా భావిస్తాము. అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









