హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మరో బాంబు పేల్చబోతున్న సిట్
- July 29, 2017
డ్రగ్స్ కేసుకు సంబంధించి కొనసాగుతున్న టాలీవుడ్ ప్రముఖుల విచారణ దాదాపుగా క్లైమాక్స్కు చేరింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరిని మాత్రమే విచారించాల్సి ఉంది. దీంతో సిట్ తర్వాత టార్గెట్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డ్రగ్స్ వాడుతున్న వారిలో సినీ ప్రముఖులతో పాటు కొందరు రాజకీయవ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారని సిట్ భావిస్తోంది. ఇప్పటికే 13 ఐటీ కంపెనీలకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు సిట్ అనుమానిస్తోంది. డ్రగ్స్ వాడుతున్న ఉద్యోగుల వివరాలను సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగుల్లో కొందరు ఒత్తిడికి లోనై డ్రగ్స్కు బానిసలవుతున్నారని సిట్ అధికారులు తేల్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









