హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మరో బాంబు పేల్చబోతున్న సిట్

- July 29, 2017 , by Maagulf
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మరో బాంబు పేల్చబోతున్న సిట్

డ్రగ్స్ కేసుకు సంబంధించి కొనసాగుతున్న టాలీవుడ్ ప్రముఖుల విచారణ దాదాపుగా క్లైమాక్స్‌కు చేరింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరిని మాత్రమే విచారించాల్సి ఉంది. దీంతో సిట్ తర్వాత టార్గెట్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డ్రగ్స్ వాడుతున్న వారిలో సినీ ప్రముఖులతో పాటు కొందరు రాజకీయవ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారని సిట్ భావిస్తోంది. ఇప్పటికే 13 ఐటీ కంపెనీలకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నట్లు సిట్ అనుమానిస్తోంది. డ్రగ్స్ వాడుతున్న ఉద్యోగుల వివరాలను సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగుల్లో కొందరు ఒత్తిడికి లోనై డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని సిట్ అధికారులు తేల్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com