మరోసారి రిపీట్ కాబోతున్న కుమారి 21 ఎఫ్ కాంబినేషన్

- July 29, 2017 , by Maagulf
మరోసారి రిపీట్ కాబోతున్న కుమారి 21 ఎఫ్ కాంబినేషన్

చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్. జీనియస్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ రైటింగ్స్ సంస్థ నుంచి రానున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు ఆగస్టు 4న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థ మరో తాజా చిత్రానికి  షెడ్యూల్ ప్రిపేర్ చేస్తోంది. 
కుమారి 21ఎఫ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ సినిమాకు కూడా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించి మ్యజిక్ చేయబోతున్నాడు. కుమారి 21ఎఫ్ తో కెరీర్ గ్రాఫ్ ను తారాజువ్వలా దూసుకెళిపోతున్న సంగతి తెలిసిందే. రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. కుమారి 21ఎఫ్  చిత్రంతో  తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ నూతన చిత్రానికి దర్శకుడు. వైవిధ్యమైన కథలకు చిరునామాగా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందిస్తున్న కథతో  సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి విజయ ప్రసాద్ బండ్రెడ్డి, సునీత-రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తారు. సహ నిర్మాత శ్రీ తులసి బండ్రెడ్డి.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com