పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 6 గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు
- July 29, 2017
అల్-అహ్మది గవర్నరేట్ పరిధిలో పేపర్ ఫ్యాక్టరీ మరియు గిడ్డంగి వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) అగ్నిమాపక యంత్రాంగం సంఘటనా స్ధలానికి చేరుకోని ఎగిసిపడుతున్నమంటలను నియంత్రణలో ఉంచారు. శుక్రవారం జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, ఐదు అగ్నిమాపక సేవ స్టేషన్ల నుండి అగ్నిమాపకదళ సిబ్బంది తమ నిర్విరామ సేవలను అందించారని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) తెలిపింది. సమీప భవనాలకు ఈ మంటలు వ్యాపించకుండా ఎగిసిపడుతున్న ఆ అగ్నిని అణచివేయడానికి సిబ్బంది ఎంతగానే శ్రమించింది. ఆ అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో ఆరుగురు అగ్నిమాపకదళ సిబ్బంది గాయపడ్డారని తెలిపింది. పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను వెల్లడి చేయటానికి ఒక దర్యాప్తుని ప్రారంభించారు. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్-మహమెద్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధి తో మాట్లాడుతూ 4000 చదరపు మీటర్ల భవనంలోని 2,500 చదరపు మీటర్ల ప్రాంతం అగ్ని ప్రమాదం వలన నష్టపోయినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









