పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 6 గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు
- July 29, 2017
అల్-అహ్మది గవర్నరేట్ పరిధిలో పేపర్ ఫ్యాక్టరీ మరియు గిడ్డంగి వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) అగ్నిమాపక యంత్రాంగం సంఘటనా స్ధలానికి చేరుకోని ఎగిసిపడుతున్నమంటలను నియంత్రణలో ఉంచారు. శుక్రవారం జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, ఐదు అగ్నిమాపక సేవ స్టేషన్ల నుండి అగ్నిమాపకదళ సిబ్బంది తమ నిర్విరామ సేవలను అందించారని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) తెలిపింది. సమీప భవనాలకు ఈ మంటలు వ్యాపించకుండా ఎగిసిపడుతున్న ఆ అగ్నిని అణచివేయడానికి సిబ్బంది ఎంతగానే శ్రమించింది. ఆ అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో ఆరుగురు అగ్నిమాపకదళ సిబ్బంది గాయపడ్డారని తెలిపింది. పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను వెల్లడి చేయటానికి ఒక దర్యాప్తుని ప్రారంభించారు. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్-మహమెద్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధి తో మాట్లాడుతూ 4000 చదరపు మీటర్ల భవనంలోని 2,500 చదరపు మీటర్ల ప్రాంతం అగ్ని ప్రమాదం వలన నష్టపోయినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









