వలసదారుల గ్రీవెన్స్లు ఓపెన్ హౌస్లో పరిశీలన
- July 29, 2017
సెంట్రల్ ప్రిజన్లో ఉన్న భారతీయుల సంఖ్య 177 కాగా, డిపోర్టేషన్ సెంటర్లో 96 మంది ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఎంబసీ టీమ్, సెంట్రల్ ప్రిజన్ని అలాగే డిపోర్టేషన్ సెంటర్ని ఇటీవలే సందర్శించింది. నెలవారీ ఓపెన్ హౌస్ ద్వారా కాన్సులర్ మరియు లేబర్ ఇష్యూస్ / కేసెస్ పరిశీలన కోసం జరుగుతుందని ఎంబసీ పేర్కొంది. భారత రాయబారి పికుమరన్, థర్డ్ సెక్రెటరీ డాక్టర్ ఎం అలీమ్ ఇతర అధికారులు వివిధ కంపెనీలను సందర్శించి వలస కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళనున్నారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ (ఐసిబిఎఫ్) జనరల్ సెక్రెటరీ మహేష్ గౌడ, ఐసిబిఎఫ్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ మాలా కృష్ణన్ తదితరులు కూడా ఈ ఓపెన్ హౌస్లో పాల్గొన్నారు. జనవరి నుంచి ఇప్పటిదాకా ఏడు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో 36 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిల్లో 23 ఫిర్యాదులు పరిష్కరింపబడ్డాయి. మరో 13 ఫిర్యాదులు ఫాలో అప్లో ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ 45 ఎమర్జన్సీ సర్టిఫికెట్లను జులైలో మంజూరు చేసింది. అలాగే 29 ఎయిర్ టికెట్స్ని అవసరమైన భారతీయులకు అందించడం కూడా జరిగింది. ఇంకో వైపున ఐసిబిఎఫ్ 29 మంది భారత జాతీయులకు రోజువారీ అవసరాలను తీర్చడం, అలాగే ట్రాన్స్ఫోర్ట్ అసిస్టెన్స్ అందించడం చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









