ప్రమాదాలపై స్పందించిన సినీనటుడు ఉత్తేజ్‌

- July 29, 2017 , by Maagulf
ప్రమాదాలపై స్పందించిన సినీనటుడు ఉత్తేజ్‌

విభాగినులకు హెచ్చరికల ఏర్పాటు 
సినీనటుడు ఉత్తేజ్‌ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలపై స్పందించారు. విభాగినులే ప్రమాదాలకు కారణమని గుర్తించి వాటికి ఎరుపు రంగు హెచ్చరికలు ఏర్పాటు చేశారు. యూసుఫ్‌గూడ బస్తీ నుంచి శ్రీనగర్‌కాలనీకి వయా ఆర్బీఐ క్వార్టర్స్‌ మీదుగా వెళ్లే ప్రధాన రహదారిలో ఆర్బీఐ క్వార్టర్స్‌ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. విభాగినులు ఏర్పాటు చేయాలంటూ గతంలో ఆయన సమస్యను ఎత్తిచూపారు. రాత్రి వేళల్లో వచ్చే వాహనాదారులు విభాగినులను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యకు తానే పరిష్కారం చూపాలనుకున్నారు. లోటస్‌ ఎన్‌క్లేవ్‌ సమీపంలో రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎరుపు రంగు జెండాలను ఏర్పాటుచేశారు. సామాజిక కార్యకర్త ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఉత్తేజ్‌కు మద్దతుగా నిలిచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com