చైనాపై ఫైర్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- July 30, 2017
కయ్యాలమారి ఉత్తరకొరియాపై చైనా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా మౌనాన్ని చూస్తూ వూరుకునేది లేదన్నారు. ‘ఉ.కొరియాపై చైనా తీరు చాలా అసంతృప్తిగా ఉంది. మా దేశంలో వ్యాపారం చేసి బిలియన్ డాలర్లు సంపాదించుకునేందుకు గత అమెరికా నేతలు చైనాకు అనుమతినిచ్చారు. కానీ చైనా మాత్రం ఒట్టి మాటలు చెప్పడం తప్ప మా కోసం ఏం చేయట్లేదు. ఇక దీన్ని చూస్తూ వూరుకునేది లేదు. ఉ.కొరియా సమస్యను చైనా చాలా సులువుగా పరిష్కరించగలదు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. తన చర్యలతో అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగుదేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా శుక్రవారం మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణితో అమెరికా మొత్తం తమ గురిలో ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ అన్నారు. కాగా.. ఉ.కొరియా ఇలాంటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఈ నెలలో ఇది రెండోసారి. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. ఉ.కొరియా చర్యలకు సరైన గుణపాఠం చెప్పాలని ట్రంప్ పదేపదే చైనాను కోరినా.. ఆ దేశం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!









