10 రాష్ట్రాలకు భూకంప ముప్పు

- July 30, 2017 , by Maagulf
10 రాష్ట్రాలకు భూకంప ముప్పు

దేశ రాజధాని ఢిల్లీ సహా 10 రాష్ట్రాల రాజధానులు భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయని జాతీయ భూకంప అధ్యాయన కేంద్రం ఓ నివేదిక వెల్లడించింది. హిమాలయ పర్వత పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలకు భూకంప ముప్పు ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పట్నా, శ్రీనగర్‌, కోహిమ, పుదుచ్చెరి, గువాహటి, గ్యాంగ్‌టక్‌, షిమ్లా, డెహ్రాడూన్‌, ఇంఫాల్‌, చండిగఢ్‌ నగరాలు భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న జోన్‌ 4, 5 లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముప్పు పొంచి ఉన్న ఒక్కో నగరంలో ప్రస్తుతం మూడు కోట్లకు పైగా జనాభ నివసిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com