బ్రిటన్లో భారతీయ మహిళ అరుదైన ఫీట్
- July 30, 2017
స్త్రీ గర్భంలో కవల పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదల ఎలా ఉంటుంది ? ఒక శిశువు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదలతో పోల్చితే, ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి ? అన్న విషయాల్ని తేల్చటం కోసం బ్రిటన్ వైద్యులు రూపొందించిన విధానం 'డిజిటల్ మానిటరింగ్'. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా భారత సంతతి బ్రిటన్ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. మాలా వస్త్ ధురీ అనే మహిళ దక్షిణ లండన్లోని సెయింట్ జార్జ్ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితం కవల పిల్లలకి జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2, 2.1 కిలోల బరువున్న ఇద్దరు నవజాత శిశువుల ఆరోగ్యం బాగుందని హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. 'డిజిటల్ మానిటరింగ్' విధానంలో గర్భస్త శిశువులపై 10వేల స్కానింగ్లు చేశారు. వీటిలో వచ్చిన రీడింగ్స్తో అనేక ఛార్ట్స్ రూపొందించారు. గర్భంలో కవల పిల్లల సహజసిద్ధమైన ఎదుగుదల (ఒక శిశువుతో పోల్చుతూ )ను ఈ ఛార్ట్స్ తెలియజేస్తాయి. వారిలోని లోపాల్ని, ఇతర సమస్యల్ని, ఎదుగుదలని, ప్రసవ సమయాన్ని అంచనావేయవచ్చు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







