బ్రిటన్లో భారతీయ మహిళ అరుదైన ఫీట్

- July 30, 2017 , by Maagulf
బ్రిటన్లో భారతీయ మహిళ అరుదైన ఫీట్

 స్త్రీ గర్భంలో కవల పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదల ఎలా ఉంటుంది ? ఒక శిశువు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదలతో పోల్చితే, ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి ? అన్న విషయాల్ని తేల్చటం కోసం బ్రిటన్‌ వైద్యులు రూపొందించిన విధానం 'డిజిటల్‌ మానిటరింగ్‌'. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా భారత సంతతి బ్రిటన్‌ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. మాలా వస్త్‌ ధురీ అనే మహిళ దక్షిణ లండన్‌లోని సెయింట్‌ జార్జ్‌ హాస్పిటల్‌లో కొద్ది రోజుల క్రితం కవల పిల్లలకి జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2, 2.1 కిలోల బరువున్న ఇద్దరు నవజాత శిశువుల ఆరోగ్యం బాగుందని హాస్పిటల్‌ వైద్యులు తెలియజేశారు. 'డిజిటల్‌ మానిటరింగ్‌' విధానంలో గర్భస్త శిశువులపై 10వేల స్కానింగ్‌లు చేశారు. వీటిలో వచ్చిన రీడింగ్స్‌తో అనేక ఛార్ట్స్‌ రూపొందించారు. గర్భంలో కవల పిల్లల సహజసిద్ధమైన ఎదుగుదల (ఒక శిశువుతో పోల్చుతూ )ను ఈ ఛార్ట్స్‌ తెలియజేస్తాయి. వారిలోని లోపాల్ని, ఇతర సమస్యల్ని, ఎదుగుదలని, ప్రసవ సమయాన్ని అంచనావేయవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com