బ్రిటన్లో భారతీయ మహిళ అరుదైన ఫీట్
- July 30, 2017
స్త్రీ గర్భంలో కవల పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదల ఎలా ఉంటుంది ? ఒక శిశువు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదలతో పోల్చితే, ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి ? అన్న విషయాల్ని తేల్చటం కోసం బ్రిటన్ వైద్యులు రూపొందించిన విధానం 'డిజిటల్ మానిటరింగ్'. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా భారత సంతతి బ్రిటన్ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. మాలా వస్త్ ధురీ అనే మహిళ దక్షిణ లండన్లోని సెయింట్ జార్జ్ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితం కవల పిల్లలకి జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2, 2.1 కిలోల బరువున్న ఇద్దరు నవజాత శిశువుల ఆరోగ్యం బాగుందని హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. 'డిజిటల్ మానిటరింగ్' విధానంలో గర్భస్త శిశువులపై 10వేల స్కానింగ్లు చేశారు. వీటిలో వచ్చిన రీడింగ్స్తో అనేక ఛార్ట్స్ రూపొందించారు. గర్భంలో కవల పిల్లల సహజసిద్ధమైన ఎదుగుదల (ఒక శిశువుతో పోల్చుతూ )ను ఈ ఛార్ట్స్ తెలియజేస్తాయి. వారిలోని లోపాల్ని, ఇతర సమస్యల్ని, ఎదుగుదలని, ప్రసవ సమయాన్ని అంచనావేయవచ్చు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









