అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఇరాక్ ఎంబసీ సమీపంలో పేలుడు
- July 31, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్లోని ఇరాక్ దౌత్యకార్యాలయానికి సమీపంలో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్ కంపౌడ్లోకి చొరబడ్డ కొందరు దుండగులు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంబసీ సమీపం నుంచి భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. పేలుడు అనంతరం కాల్పుల శబ్దాలు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









