అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఇరాక్ ఎంబసీ సమీపంలో పేలుడు
- July 31, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్లోని ఇరాక్ దౌత్యకార్యాలయానికి సమీపంలో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్ కంపౌడ్లోకి చొరబడ్డ కొందరు దుండగులు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంబసీ సమీపం నుంచి భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. పేలుడు అనంతరం కాల్పుల శబ్దాలు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









