అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఇరాక్ ఎంబసీ సమీపంలో పేలుడు
- July 31, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబూల్లోని ఇరాక్ దౌత్యకార్యాలయానికి సమీపంలో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్ కంపౌడ్లోకి చొరబడ్డ కొందరు దుండగులు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంబసీ సమీపం నుంచి భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. పేలుడు అనంతరం కాల్పుల శబ్దాలు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







