మల్టీ స్టారర్ చిత్రంలో వెంకటేష్, దగ్గుబాటి రానా .. తమిళ రీమేక్లో బాబాయి, అబ్బాయి
- July 31, 2017
తమిళంలో విక్రమ్ వేద అనే చిత్రం సంచలన విజయం దిశగా వెళ్తున్నది. ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం బ్రహ్మండమైన వసూళ్లను సాధిస్తున్నది. వీరిద్దరి నటనకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో వెంకటేశ్, రానా నటించనున్నారనేది తాజా సమాచారం.
ఈ చిత్రం కోసం రానా దగ్గుబాటి, వెంకటేశ్ను సంప్రదించాం. వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. తమిళంలో ఆర్ మాధవన్ పోషించిన పాత్రను వెంకటేశ్, విజయ్ సేతుపతి నటించిన పాత్రకు రానాను అడుగుతున్నాం. విక్రమ్ వేద చూసిన తర్వాత మా మొదటి చాయిస్ వారేనని భావించాం అని ఓ చిత్ర యూనిట్ పేర్కొన్నది.
ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. దేనిపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో నెలరోజుల్లో ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మీడియాకు అధికారికంగా వెల్లడిస్తాం అని ఓ చిత్ర యూనిట్ వెల్లడించింది.
విక్రమ్ వేద అనే చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించింది. విక్రమ్ భేతాళ కథల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విక్రమ్గా ఆర్ మాధవన్ నిజాయితీ ఆఫీసర్గా నటించారు. బేతాళుడి పాత్రలో విజయ్ సేతుపతి గ్యాంగస్టర్గా నటించారు.
తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై విక్రమ్ వేద చిత్ర నిర్మాత శశికాంత్ స్పందించారు. ఈ చిత్ర రీమేక్పై స్పందించడం తొందరపాటే అవుతుంది. చర్చలు జరుతున్నాయి. ఇంకా ఏది ఖారారు కాలేదు అని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







