పోలీసు అధికారిగా ఉండాలనే బాలుని కోర్కెను అంగీకరించిన దుబాయ్ పోలీస్
- July 31, 2017
"కలలు కనండి ..వాటిని కష్టించి సాకారం చేసుకోండని " దివంగత మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బావి భారత పౌరులకు ఓ మంచి సందేశం అప్పట్లో ఇచ్చారు. అందాకా ఆగలేని ఓ దుబాయ్ బుడతడు తన తండ్రీని సతాయించడం మొదలుపెట్టాడు. దానితో ఆ తండ్రి దుబాయ్ పోలీసుల అధికారి కావాలని కోరిక తన కుమారుడికి ఉందని...అందుకోసం తనను నిత్యం సతాయిస్తున్నాడని తన ఎనిమిదేళ్ల కుమారుడి కోరికను తీర్చండి మహాప్రభో అంటూ దుబాయ్ పోలీసులకు ట్వీట్ చేశాడు. అందుకు స్పందించిన దుబాయ్ పోలీస్ పోలీసు యూనిఫారం తీసుకొని ఆ బాలుని పోలీసు కేంద్రానికి రావాలని సాదరంగా ఆహ్వానం పలికి ఆ బాలుడి పర్యటనను ఆస్వాదించడానికి ఓ అవకాశం ఇచ్చారు..ఇమిరాటీ తండ్రీ ఈసా అలీ అల్ బెలోషీ తన పుత్రరత్నం అబ్దుల్లా కోరికను వీడియో రూపంలో పోలీసులను అర్థిస్తూ ఉన్న వీడియోను గత వారం ట్విట్ చేసాడు. తనకు తానుగా తన సొంత దుబాయ్ పోలీస్ యూనిఫామ్ సైతం కల్గి ఉన్నాడని పేర్కొంటూ తన ఫోన్ నెంబర్ అందులో తెలియచేసి దుబాయ్ పోలీస్ ట్విట్టర్ ఖాతాకు ఆ తండ్రి ట్వీట్ చేశాడు. 24 గంటల తర్వాత దుబాయ్ పోలీస్ నుండి ఆ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. మీ కుమారుని కొత్త యూనిఫామ్ కుట్టించేందుకు ..కొలతలు తీసుకొనేందుకు మా టైలర్ మీ వద్దకు వచ్చి మీ బాబు శారీరక కొలతలు తీసుకొంటారని చెప్పినపుడు ఆశ్చర్యపోయాడు జులై 27 వ తేదీన దుబాయ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చినపుడు ఆ నూతన యూనిఫామ్ తీసుకోవాలని సూచించారు. దుబాయ్ పోలీస్ సోషల్ మీడియా నెట్వర్క్స్ శాఖ డైరెక్టర్ అన్నా అల్ బన్నా సమక్షంలో ఆ యూనిఫామ్ ను అందచేయనున్నారు. "మేజర్ జనరల్ అల్ మెర్రి అబ్దుల్లా కోరిక నెరవేరచనున్నాం. 8 ఏళ్ళ వయస్సు ఉన్న ఆ బాలునిలి మొదటి లెఫ్టినెంట్ పోలీస్ అధికారిగా ర్యాంక్ ఇచ్చి గౌరవిస్తున్నాం. ఈ చర్య ద్వారా సమాజంలో ఆనందాన్ని కల్గించాలని తమ వ్యూహమని పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలకు సంతోషం కలిగించే విధానమని అల్ బన్నా చెప్పారు. రాస్ అల్ ఖైమా పాఠశాలలో గ్రేడ్ 4 చదువుతున్న ఆ బాలుడు యూనిఫాంను ధరించిన తర్వాత, రాస్ అల్ ఖైమాకు తిరిగి వెళ్లడానికి ముందు అతని తండ్రి తన యూనిఫాంతో పోలీసు ప్రధాన కార్యాలయంలో నడుస్తున్నప్పుడు తన కుమారుడికి చెందిన పలు వీడియోలనుపోస్ట్ చేశాడు. ఓ వీడియో ముగింపులో "దుబాయ్ పోలీసు ధన్యవాదాలు," అబ్దుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









