స్నాప్డీల్ లో భారీగా ఉద్యోగులపై వేటు
- July 31, 2017
ఫ్లిప్కార్ట్తో అతిపెద్ద విలీన చర్చలను రద్దు చేసుకున్న ఈ కామర్స్సంస్థ మరోసారి ఉద్యోగులపై భారీగా వేటువేయనుంది. భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు స్నాప్డీల్ సోమవారం ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 80శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్టు చెప్పింది. అలాగే స్నాప్డీల్ వ్యవస్థపాకులు కునాల్ బాల్, రోహిత్ బన్సల్ గత గురువారం సాయంత్రంమే ఈ కీలక ఆదేశాలను జారీ చేసినట్టు సమాచారం. తమ వ్యాపార, సాంకేతిక హెడ్లను తమ టీంను పునర్నిర్మించాలని, ఉద్యోగుల తొలగింపు కోసం పేపర్వర్క్ను ప్రారంభించాలని గట్టిగా సూచించినట్టు తెలుస్తోంది.
సంబంధిత విభాగాల హెడ్స్కు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు ఐఎన్ఎస్కు చెప్పారు. ఈ తీసివేత జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కోరినట్టు తెలిపారు. గత ఏడాది జూలైలో 9వేలమంది ఉద్యోగులను కలిగి వున్న స్నాప్డీల్ ఇటీవల ఈ సంఖ్యను 12వందలకు కుదించింది. దీంతో దేశీయ ఈకామర్స్ లో అతిపెద్దడీల్గా నిలవనుందని , తద్వారా తమ ఉద్యోగాలకుఢోకా ఉండదని భావించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









