ఇబ్బందిగా మారిన పాక్ సరిహద్దులోని అతిపెద్ద జెండా
- July 31, 2017
శాశ్వత శత్రువు పాకిస్థాన్కు కనిపించేలా ఏర్పాటు చేసిన అతిపెద్ద త్రివర్ణ పతాకం మూడు నెలలుగా కనిపించడం లేదు. భారత్-పాక్ సరిహద్దులోని అట్టారిలో 360 అడుగుల పొడవైన భారీ జెండాను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంత ఎత్తులో ఉండటం.. గాలి వేగంగా వీస్తుండటంతో పతాకం ప్రతిసారీ చిరగడం.. అమృత్సర్ పరిపాలన విభాగం తొలగించడం జరిగిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో చిరిగిన పతాకాన్ని తొలగించిన తర్వాత మళ్లీ కొత్త జెండా ఎగరేయలేదు. మువ్వన్నెల పతాకం చిరిగి ఇబ్బంది పెడుతోందని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కమల్దీప్ సింగ్ సంఘా రాష్ట్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ కూడా రాశారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలీక హోం శాఖ మల్లగుల్లాలు పడుతోంది.
పెరిగిన ఖర్చు:
సరిహద్దుల్లో జెండాతో పాటు అమృత్సర్ నగరంలోని 170 అడుగుల జెండాను అధికారులు తొలగించారు. అట్టారి జెండా మూడు సార్లు చిరిగిపోగా ఈ జెండా 13 సార్లు చిరిగింది. 15 రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం వస్తుండటంతో అప్పటిలోగా పతాకాలను పునరుద్ధరిస్తారో లేదో తెలియడం లేదు. ఈ అంశంపై అమృత్సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ప్రభుత్వంతో, మంత్రి నవ్జోత్ సింగ్ సిద్ధూతో మాట్లాడతానని చెప్పారు. జెండాల బాధ్యత ఉన్న అమృత్సర్ అభివృద్ధి సంస్థకు ఈ రెండు పతకాల నిర్వహణ భారంగా మారింది. ఇప్పటి వరకు సరిహద్దు జెండాకు రూ.3 లక్షలు, నగరంలోని జెండాకు రూ.6 లక్షలు ఖర్చుచేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







