రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు
- August 03, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్ ఖైమాలో జరిగింది. రమ్స్ షమాల్ రోడ్పై ఈ ఘటన చోటు చేసుఉంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కార్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్లు, పోలీసులు, పారామెడిక్స్ని అలాగే రెస్క్యూ టీమ్స్ని పంపించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదం తర్వాత అగ్ని కీలలు వ్యాపించాయనీ, ఆ అగ్ని కీలల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వివరించారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







