పసుపుతో పలు లాభాలు

- August 09, 2017 , by Maagulf
పసుపుతో పలు లాభాలు

10 గ్రాముల పచ్చిపసుపు చూర్ణాన్ని, 40 గ్రాముల ఆవుపెరుగుతో కలిపి రోజూ ఉదయం వేళ సేవిస్తే కామెర్లు తగ్గుతాయి. అయితే ఈ స్థితిలో ఆహారంలో కారం, పులుపు, మసాలాలు లేకుండా తీసుకోవాలి..
పసుపు సౌందర్య సాధనం కూడా. పసుపు, చందనం... రెండింటినీ పాలమీగడతో కలిపి, ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా కడిగితే ముఖ వర్చస్సు పెరుగుతుంది.
పసుపు వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను రెండేసి గ్రాముల చొప్పున తీసుకుని వాడితే క్రిమి రోగాలు, చర్మ వ్యాధులు నయమవుతాయి.
పసుపు, తులసి ఆకుల మిశ్రమాన్ని పట్టీ వేస్తే వ్రణాలు మానిపోతాయి.
పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్ట చూర్ణం సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా చేసి... గాయాలు, మొటిమలపై పట్టీ వేస్తే ఇట్టే తగ్గిపోతాయి. చర్మ వ్యాధులూ నయమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com