పసుపుతో పలు లాభాలు
- August 09, 2017
10 గ్రాముల పచ్చిపసుపు చూర్ణాన్ని, 40 గ్రాముల ఆవుపెరుగుతో కలిపి రోజూ ఉదయం వేళ సేవిస్తే కామెర్లు తగ్గుతాయి. అయితే ఈ స్థితిలో ఆహారంలో కారం, పులుపు, మసాలాలు లేకుండా తీసుకోవాలి..
పసుపు సౌందర్య సాధనం కూడా. పసుపు, చందనం... రెండింటినీ పాలమీగడతో కలిపి, ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా కడిగితే ముఖ వర్చస్సు పెరుగుతుంది.
పసుపు వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను రెండేసి గ్రాముల చొప్పున తీసుకుని వాడితే క్రిమి రోగాలు, చర్మ వ్యాధులు నయమవుతాయి.
పసుపు, తులసి ఆకుల మిశ్రమాన్ని పట్టీ వేస్తే వ్రణాలు మానిపోతాయి.
పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్ట చూర్ణం సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా చేసి... గాయాలు, మొటిమలపై పట్టీ వేస్తే ఇట్టే తగ్గిపోతాయి. చర్మ వ్యాధులూ నయమవుతాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









