కృష్ణాష్టమికి మొదలుకానున్న మహేశ్ 25వ చిత్రం
- August 13, 2017
సూపర్స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్', కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన 25 చిత్రం మొదలుకాబోతోంది. సోమవారం కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈ చిత్ర వివరాలను ప్రకటించనున్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. అశ్విని దత్, దిల్రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' చిత్రంతో మహేశ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహపూర్వక బంధం ఉంది. ఇప్పుడు రాబోతున్న మహేశ్ 25వచిత్రాన్ని రేపు పూజాకార్యక్రమంతో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ హాజరుకానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







