కృష్ణాష్టమికి మొదలుకానున్న మహేశ్ 25వ చిత్రం
- August 13, 2017
సూపర్స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్', కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన 25 చిత్రం మొదలుకాబోతోంది. సోమవారం కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈ చిత్ర వివరాలను ప్రకటించనున్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. అశ్విని దత్, దిల్రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' చిత్రంతో మహేశ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహపూర్వక బంధం ఉంది. ఇప్పుడు రాబోతున్న మహేశ్ 25వచిత్రాన్ని రేపు పూజాకార్యక్రమంతో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ హాజరుకానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







