యూఏఈ, సౌదీ, ఒమన్ ఆపరేషన్స్లో డ్రగ్స్ పట్టివేత
- August 15, 2017
డ్రగ్స్ ట్రాఫికర్స్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ని ఈ ఏడాది ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్లలో 12 మంది డ్రగ్ డీలర్స్ అరెస్ట్ అయ్యారు. 158 కిలోల కన్నాబిస్, 2.7 మిలియన్ల పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డ్రగ్స్ వ్యతిరేకంగా యూఏఈ పోరాడుతోందనీ, ఈ క్రమంలో పొరుగుదేశాలకు సహకారం అందించడంతోపాటు, వారి నుంచీ సహకారం తీసుకుని, ఉమ్మడి పోరాటం డ్రగ్స్పై చేస్తోందని ఫెడరల్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్, యాంటీ నార్కోటిక్స్ కౌన్సిల్ ఛైర్మన్ కల్నల్ సయీద్ అబ్దుల్లా అల్ సువైది చెప్పారు. యెమెన్ నుంచి యూఏఈకి ఒమన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నవారి నుంచి 50 కిలోల కన్నాబిస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒమన్ పోలీసుల సహకారం మరువలేనిదని చెప్పారు అధికారులు. మరో ఆపరేషన్లో యూఏఈ ద్వారా సౌదీ అరేబియాలోకి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఆ యత్నాన్ని భగ్నం చేశారు. డ్రగ్స్పై అంతర్జాతీయ స్థాయి పోరాటం సత్ఫలితాలనిస్తుందని కల్నల్ సౌద్ అల్ కువైటి చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









