యూఏఈ, సౌదీ, ఒమన్ ఆపరేషన్స్లో డ్రగ్స్ పట్టివేత
- August 15, 2017
డ్రగ్స్ ట్రాఫికర్స్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ని ఈ ఏడాది ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్లలో 12 మంది డ్రగ్ డీలర్స్ అరెస్ట్ అయ్యారు. 158 కిలోల కన్నాబిస్, 2.7 మిలియన్ల పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డ్రగ్స్ వ్యతిరేకంగా యూఏఈ పోరాడుతోందనీ, ఈ క్రమంలో పొరుగుదేశాలకు సహకారం అందించడంతోపాటు, వారి నుంచీ సహకారం తీసుకుని, ఉమ్మడి పోరాటం డ్రగ్స్పై చేస్తోందని ఫెడరల్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్, యాంటీ నార్కోటిక్స్ కౌన్సిల్ ఛైర్మన్ కల్నల్ సయీద్ అబ్దుల్లా అల్ సువైది చెప్పారు. యెమెన్ నుంచి యూఏఈకి ఒమన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నవారి నుంచి 50 కిలోల కన్నాబిస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒమన్ పోలీసుల సహకారం మరువలేనిదని చెప్పారు అధికారులు. మరో ఆపరేషన్లో యూఏఈ ద్వారా సౌదీ అరేబియాలోకి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఆ యత్నాన్ని భగ్నం చేశారు. డ్రగ్స్పై అంతర్జాతీయ స్థాయి పోరాటం సత్ఫలితాలనిస్తుందని కల్నల్ సౌద్ అల్ కువైటి చెప్పారు.
తాజా వార్తలు
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!









