యూఏఈ, సౌదీ, ఒమన్ ఆపరేషన్స్లో డ్రగ్స్ పట్టివేత
- August 15, 2017
డ్రగ్స్ ట్రాఫికర్స్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ని ఈ ఏడాది ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్లలో 12 మంది డ్రగ్ డీలర్స్ అరెస్ట్ అయ్యారు. 158 కిలోల కన్నాబిస్, 2.7 మిలియన్ల పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డ్రగ్స్ వ్యతిరేకంగా యూఏఈ పోరాడుతోందనీ, ఈ క్రమంలో పొరుగుదేశాలకు సహకారం అందించడంతోపాటు, వారి నుంచీ సహకారం తీసుకుని, ఉమ్మడి పోరాటం డ్రగ్స్పై చేస్తోందని ఫెడరల్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్, యాంటీ నార్కోటిక్స్ కౌన్సిల్ ఛైర్మన్ కల్నల్ సయీద్ అబ్దుల్లా అల్ సువైది చెప్పారు. యెమెన్ నుంచి యూఏఈకి ఒమన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నవారి నుంచి 50 కిలోల కన్నాబిస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒమన్ పోలీసుల సహకారం మరువలేనిదని చెప్పారు అధికారులు. మరో ఆపరేషన్లో యూఏఈ ద్వారా సౌదీ అరేబియాలోకి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఆ యత్నాన్ని భగ్నం చేశారు. డ్రగ్స్పై అంతర్జాతీయ స్థాయి పోరాటం సత్ఫలితాలనిస్తుందని కల్నల్ సౌద్ అల్ కువైటి చెప్పారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







