ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ బేఖాతర్‌

- August 15, 2017 , by Maagulf
ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ బేఖాతర్‌

అబుదాబీ: 30 ఏళ్ళ లోపు మహిళలు మెయిడ్స్‌గా పనిచేయడానికి వీల్లేదంటూ ఖచ్చితమైన ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు భారతదేశంలో ఉన్నా, ఆ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ విజిట్‌ వీసాతో యూఏఈలోకి ప్రవేశించి, ఆ తర్వాత మెయిడ్స్‌గా మారుతున్న 30 ఏళ్ళలోపు మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడ వారికి అనేక సమస్యలు తలెత్తడంతో, యజమానిపై ఆరోపణలు చేస్తూ, అధికారుల సహాయం కోరుతుండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఇలాంటి కేసులు 15 నుంచి 20 వరకు తమ దృష్టికి వస్తున్నాయని కాన్సులర్‌ ఆఫ్‌ కమ్యూనిటీ ఎఫైర్స్‌, ఇండియన్‌ ఎంబసీ - అబుదాబీ దినేష్‌కుమార్‌ చెప్పారు. ఇండియన్‌ గవర్నమెంట్‌ వద్ద రిజిస్టర్‌ కాని కొందరు ఏజెంట్స్‌ ఈ తరహా అక్రమాలకు తావిస్తున్నట్లు ఆయన వివరించారు. నిబంధనల్ని మరింత కఠినతరం చేయడంతోపాటుగా, మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సి ఉందనీ, తమ దృష్టికి వచ్చే కేసుల పరిష్కారంలో మానవీయ కోణంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు కుమార్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com