అబుదాబీలో ఇండియా, పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాల సెలబ్రేషన్స్
- August 15, 2017
ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడం, ఆగస్ట్ 15వ తేదీ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అధికారులు, ఆయా దేశాల నుంచి వచ్చినవారికి ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఫ్లాష్ మాబ్స్, ఆయా దేశాల పతాకాలతో కూడిన బెలూన్స్ని ఎగరవేయడం వంటివి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. దీంతో ఇరు దేశాలకు చెందినవారూ అబుదాబీ విమానాశ్రయంలో తమకు దక్కిన విశేష ఆదరణకు ముగ్దులయ్యారు. ప్రయాణీకుల్లో 50 మందిని ఎంపిక చేసి, వారికి లగ్జరీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని ప్రత్యేక ఆఫర్ కింద అందించారు. ఇండియా, పాకిస్తాన్ తమకు అత్యంత విలువైన ట్రావెల్ మార్కెట్స్ అనీ, ఆయా దేశాల పట్ల తమకు ప్రత్యేకమైన గౌరవం వుందని ఈ కారణంగానే తాము ప్రత్యేక ఏర్పాట్లు ఆయా దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశామని యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ మజీద్ అల్ ఖూరి చెప్పారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









