సోషల్ మీడియాను కొత్త ట్రెండ్ తో ఊపేయనున్న ఎన్టీఆర్

- August 20, 2017 , by Maagulf
సోషల్ మీడియాను కొత్త ట్రెండ్ తో ఊపేయనున్న ఎన్టీఆర్

జై లవ కుశ సినిమాను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్, ప్రమోషన్ పద్ధతుల్లోనూ సరికొత్త టెక్నాలజీలను ఆశ్రయిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా రానా కూడా ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు. అదే బాటలో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ కొత్త పంథాను పరిచయం చేస్తున్నాడు. ఇటీవల ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఫోటోనే ఎమోజీగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సరికొత్త ట్రెండ్ కు నాంధి పలికాడు.

తాజాగా సౌత్ స్టార్ విజయ్ తన కొత్త మెర్సల్ (తెలుగులో అదిరింది) స్టిల్ ను కూడా ఎమోజీగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. జై లవ కుశ సినిమాలోని మూడు క్యారెక్టర్లకు సంబంధించిన మూడు ఎమోట్ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇలా ప్రత్యేక ఎమోట్ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ట్విట్టర్ సంస్థ గట్టిగానే చార్జ్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే టాలీవుడ్ లో తరహా ప్రచారాన్ని ప్రారంభించిన తొలి నటుడిగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించబోతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com