ఈ నెల చివర్లోనే రానున్న కొత్త రూ.200 నోటు
- August 22, 2017
చరిత్రలోనే మొట్టమొదటిసారి 200 డినామినేటెడ్ బ్యాంకు నోట్లు మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఆగస్టు చివరి రోజుల్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కొత్త రూ.200 బ్యాంకు నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చలామణిలోకి తీసుకు రాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న అనంతరం రూ.50 కోట్ల నోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల చలామణిలో ఎలాంటి అక్రమ ట్రేడింగ్ జరుగకుండా ఉండేందుకు ఆర్బీఐ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు రూ.100, రూ.500 డినామినేషన్ నోట్లకు మధ్యలో ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లు లేవు.
ఆర్బీఐ ప్రస్తుతం తీసుకురాబోతున్న రూ.200 నోట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ఈ కారణంతోనే పకడ్బందీగా ఈ నోట్లను విడుదల చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆర్బీఐ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. పెద్ద మొత్తంలో ఈ నోట్లను విడుదల చేస్తుండటంతో, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కార్యాచరణ సమస్యలను ఇవి నిరోధిస్తాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోస్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం మొట్టమొదటిసారి ఆర్బీఐ తీసుకొచ్చిన రూ.2000 బ్యాంకు నోట్లలో తీవ్రంగా బ్లాక్ మార్కెటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు, ఏజెన్సీలు జరిపిన తనిఖీల్లో గుట్టలుగుట్టలు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









