గత వారం జరిగిన కాల్పుల్లో బార్సిలోనాలో తీవ్రవాదులకు జైలు

- August 23, 2017 , by Maagulf
గత వారం జరిగిన కాల్పుల్లో బార్సిలోనాలో తీవ్రవాదులకు జైలు

గత వారం జరిగిన బార్సిలోనా తీవ్రవాద దాడి అనంతరం నిర్బంధంలోకి తీసుకున్న నలుగురిలో ఇద్దరికి ఏకాంత కారాగార వాస శిక్ష విధిస్తూ నేషనల్‌ కోర్టు (ఎఎన్‌) న్యాయమూర్తి ఫెర్నాండో ఆండ్రూ తీర్పు చెప్పారు. శిక్ష కాలంలో వారికి బెయిల్‌ కూడా లభించదు. గత గురువారం బార్సిలోనా, కాంబ్రిల్స్‌ల్లో జరిగిన దాడుల్లో 15మంది మరణించగా, వందమందికి పైగా గాయపడ్డారు. ఆ దాడులకు పాల్పడిన జిహాదీస్ట్‌ సెల్‌ సభ్యులుగా భావిస్తున్న మహ్మద్‌ హులీ చెమ్‌లాల్‌, డ్రిస్‌ ఒకబిర్‌లకు న్యాయమూర్తి శిక్ష విధించారు. తీవ్రవాద సంస్థలో చేరడం, హత్యలు వంటి అభియోగాలను వారిపై మోపారు. రిపోల్‌ పట్టణంలో చిన్న టెలిఫోన్‌ కాల్‌ సెంటర్‌ నడుపుతున్న సాలాV్‌ా ఎల్‌ కరీబ్‌కు ఈ దాడుల్లో గల పాత్రపై నిర్ధారణకు వచ్చేవరకు శిక్ష విధించే విషయమై 72గంటల పాటు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని నిలుపు చేశారు. చివరకు అతనిని వదిలిపెట్టారు. కరీబ్‌పై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com