యెమెన్లో సౌదీ సంకీర్ణ సేనల దాడులో 60 మంది మృతి, హోటల్ ధ్వంసం
- August 23, 2017
-60 మంది మృతి, హోటల్ ధ్వంసం
సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణ సేనలు యెమెన్లోని షియా హుథీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని బుధవారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 60 మంది మృతి చెందారు. అర్హాబ్ పట్టణంపై జరిగిన ఈ దాడుల్లో హుథీ తిరుగుబాటుదారులతోపాటు పౌరులు కూడా మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో ఖ్వా అల్ ఖ్వైదీలోని రెండంతస్తుల హోటల్ భవనం కూడా కూలిపోయింది. ఆ సమయంలో హోటల్లో ఉన్నవారు మృత్యువాత పడ్డారని, మృతదేహాలు శిథిలాల కిందే చిక్కుకున్నాయంటున్నారు. ఈ హోటల్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో హుథీలు నిర్వహిస్తున్న చెక్పోస్ట్పైనా వైమానిక దాడులు జరిగాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







