విశాఖలో మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా 8 ఐటీ శాఖలు ప్రారంభం

- August 24, 2017 , by Maagulf
విశాఖలో మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా 8 ఐటీ శాఖలు ప్రారంభం

విశాఖ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించారు. 'ఏపెక్స్‌' కంటెంట్‌ సొల్యూషన్స్‌, వెంటర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌, ఐడీఏ ఆటోమేషన్‌, జీవా డిజిటల్‌ సర్వీసెస్‌, అవ్యా ఇన్‌వెట్రాక్స్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్స్‌, అమ్‌జూర్‌ ఇన్ఫోటెక్‌, విస్మయ ప్రీమీడియా సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఈ కంపెనీలు 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. రిషికొండ వద్ద టెక్‌ మహీంద్రాకు చెందిన లక్ష చదరపు అడుగుల కార్యాలయ స్థలం గల 11 అంతస్థుల భవనాన్ని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఏటీ ఏజెన్సీ(ఏపీటా) అద్దెకు తీసుకుని కంపెనీలకు కేటాయించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com