భారత రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్లైన్ నంబర్
- August 28, 2017
ముంబయి: రైళ్లల్లో తరచుగా చోరీలు, దాడులు, ఆకతాయిల ఆగడాలతో ప్రయాణికులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమ రైల్వే జోన్ కేంద్రస్థానమైన ముంబయిలో గవర్నమెంటు రైల్వే పోలీసులు(జీఆర్పీ) ఓ హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సర్వీసు ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉందని వారు తెలిపారు.
రైళ్లల్లో, రైల్వే ప్లాట్ఫారాలపై జరిగే నేరాలను అరికట్టేందుకు 1512 హెల్ప్లైన్ నంబర్ను వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నట్లు స్థానిక జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు. కదులుతున్న రైల్లో ప్రయాణికులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే వారు 1512కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే చాలు. రైలు తదుపరి స్టేషన్కు చేరుకునే సమయానికి అక్కడ పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఈ సర్వీసు దేశంలో పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. రైళ్లల్లో నేరాలను తగ్గు ముఖం పట్టించాలన్న ఉద్దేశంతోనే ఈ హెల్ప్లైన్ నంబర్ని తీసుకువచ్చినట్లు అధికారి వివరించారు.
జీఆర్పీలో ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ ఈ సర్వీసును విజయవంతంగా నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది దోపిడీ కేసులు 35శాతం తగ్గాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







