భారత రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్లైన్ నంబర్
- August 28, 2017
ముంబయి: రైళ్లల్లో తరచుగా చోరీలు, దాడులు, ఆకతాయిల ఆగడాలతో ప్రయాణికులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమ రైల్వే జోన్ కేంద్రస్థానమైన ముంబయిలో గవర్నమెంటు రైల్వే పోలీసులు(జీఆర్పీ) ఓ హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సర్వీసు ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉందని వారు తెలిపారు.
రైళ్లల్లో, రైల్వే ప్లాట్ఫారాలపై జరిగే నేరాలను అరికట్టేందుకు 1512 హెల్ప్లైన్ నంబర్ను వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నట్లు స్థానిక జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు. కదులుతున్న రైల్లో ప్రయాణికులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే వారు 1512కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే చాలు. రైలు తదుపరి స్టేషన్కు చేరుకునే సమయానికి అక్కడ పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఈ సర్వీసు దేశంలో పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. రైళ్లల్లో నేరాలను తగ్గు ముఖం పట్టించాలన్న ఉద్దేశంతోనే ఈ హెల్ప్లైన్ నంబర్ని తీసుకువచ్చినట్లు అధికారి వివరించారు.
జీఆర్పీలో ఉద్యోగుల కొరత ఉన్నప్పటికీ ఈ సర్వీసును విజయవంతంగా నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది దోపిడీ కేసులు 35శాతం తగ్గాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









