జగన్ ముఖ్యమంత్రి కావడం కలలోనే అంటున్న కొల్లు రవీంద్ర
- August 31, 2017
కడపను ప్రత్యేక రాష్ట్రం చేస్తే తప్ప జగన్ ముఖ్యమంత్రి కావడం కష్టమని వైకాపా నాయకులే నవ్వుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. విజయవాడ నగర తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఫలితమే రేపు కాకినాడలో పునరావృతం కాబోతోందన్నారు. ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసురుతున్న జగన్.. ముందు పులివెందులలో రాజీనామా చేసి గెలవాలని చెప్పారు. నంద్యాలలో కోట్లు ఖర్చు చేసిందీ.. పోలీసులకు దొరికిందీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
డేరాబాబా గతే జగన్ బాబాకు త్వరలో పట్టబోతోందని చెప్పారు. రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలకు అంత మంచిందన్నారు. వెనకబడిన తరగతులకు వివాహం కోసం రూ.25వేల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







