సౌదీ రాజు సల్మాన్ తో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

- August 31, 2017 , by Maagulf
సౌదీ రాజు సల్మాన్ తో  ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

సౌదీ కింగ్ సల్మాన్తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం ఫోన్లో మాట్లాడారు.కతర్ వివాదానికి సంబంధించి పలు గల్ఫ్ దేశాలతో ముడిపడి  చిక్కుకుపోయిన ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దౌత్యపరమైన తీర్మానం కోసం  అన్ని పార్టీలు కృషి చేయాలని ఆయన కోరారు. వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ మరియు ఇస్లాంవాదులకు దోహా అందిస్తున్న మద్దతు కారణంగా యుఎఇ, బహ్రెయిన్ మరియు ఈజిప్టు దేశాలు కతర్ దేశంతో  రాజకీయ, వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకొన్నారు. ట్రంప్ రియాద్ సందర్శించినప్పుడు ఒక దౌత్యపరమైన తీర్మానం ఒక నిబద్ధతతో  నెరవేరుస్తానని కింగ్ సల్మాన్ తో చెప్పారు. తీవ్రవాదంతో పోరాడుతున్నప్పుడు ఉండాల్సిన ఐక్యత.  ఇటీవల అమెరికాను కుదిపివేసిన హరికేన్ హార్వే గురించి సైతం ఫోన్లో  చర్చించారు. ప్రియమైన వారిని పోగొట్టుకున్నఅమెరికా పౌరులకు కింగ్ సల్మాన్ తన సంతాపాన్ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com